క్రైమ్/లీగల్
పిడుగు పడి వృద్ధురాలి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 August 2019
ఎస్.కోట, ఆగస్టు 16: విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సన్యాసిపాలెంలో శుక్రవారం సాయంత్రం పిడుగు పడి ఉప్పాడ అక్కమ్మ (65) అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతోపాటు అక్కడి పొలంలో పనిచేస్తున్న మరో ఏడుగురు మహిళలకు గాయాలయ్యాయి. దీంతో పక్కనే ఉన్న రైతులు వీరిని ధర్మవరం గ్రామానికి తీసుకువచ్చి ప్రథమ చికిత్సలు నిర్వహించి విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఈ సందర్భంగా ధర్మవరంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించిన వైద్యుడు డాక్టర్ హరి మాట్లాడుతూ ఏడుగురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. అక్కమ్మ మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం స్థానిక పీహెచ్సీకి తరలించారు. ఎస్సై అమ్మినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.