క్రైమ్/లీగల్

60 ఏళ్ల మహిళ పిత్తాశయంలో 400 రాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనపర్తి, ఆగస్టు 16: కడుపునొప్పితో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధురాలికి శస్తచ్రికిత్స చేసిన వైద్యులు ఆమె పిత్తాశయం నుండి ఏకంగా 400 చిన్నా,పెద్దా రాళ్లు తొలగించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి ఈ శస్తచ్రికిత్స నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కర్రి సునీల్ రెడ్డి, డాక్టర్ బాంధవి తెలిపిన వివరాలిలావున్నాయి. జిల్లాలోని మండపేట మండలం పాలతోడు గ్రామానికి చెందిన పండ సూరమ్మ అనే అరవై సంవత్సరాల మహిళ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేక తమ ఆసుపత్రికి వచ్చిందన్నారు. ఆమెకు స్కానింగ్ చేయగా పిత్తాశయంలో 400 రాళ్లను గుర్తించామన్నారు. లాప్రోస్కోపీ చికిత్స ద్వారా మొత్తం రాళ్లను తొలగించామన్నారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగా ఉందని వారు తెలిపారు. ఎనస్తీషియన్ డాక్టర్ జగన్మోహన్‌రెడ్డి సహాయంతో ఆపరేషన్ నిర్వహించినట్లు వారు తెలిపారు.