క్రైమ్/లీగల్
ఆటో ఢీకొని బాలిక మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 August 2019
హయత్నగర్, ఆగస్టు 15: ఆటో ఢీకొని బాలిక మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా దామచర్ల గ్రామానికి చెందిన గుంటి భాస్కర్ రెండవ కుమార్తె గుంటి దీక్ష(11నెలలు) మూడు రోజులుగా దీక్ష అనారోగ్యంతో బాధపడుతుండగా స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించినా నయం కాలేదు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ అంబులెన్స్లో వస్తుండగా అబ్దుల్లాపూర్మెట్ చౌరస్తా వద్దకు రాగానే నిర్లక్ష్యంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.