క్రైమ్/లీగల్

టాటా ఏస్ ట్రాలీ ఢీ :బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఆగస్టు 15: ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడిని ట్రాలీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి యంనంపేట్‌లో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యంనంపేట్ గ్రామంలోని ఈడబ్ల్యూసీ కాలనీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటు సెంట్రింగ్ పనులు చేస్తున్న కొరడ శ్రావణ్‌కుమార్ కుమారుడు కొరడ సుశాంత్(13నెలలు) ఇంటి ఎదుట ఆడుకుంటుండగా అతి వేగంగా వచ్చిన టాటా ఏసీ ట్రాలీ(ఏపి 28 టిఏ 3146) ఢీ కొట్టినట్లు తెలిపారు. దింతో తలకు తీవ్రంగా గాయాలైన సుశాంత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అటో ట్రాలీ డ్రైవర్ యంనంపేట్ గ్రామానికి చెందిన పోలగోని సురేష్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం, పరశురాంపురం గ్రామానికి చెందినవారని, ఇటీవల వలస వచ్చి యంనంపేట్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ రఘువీర్ రెడ్డి తెలిపారు.