క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, ఆగస్టు 15: స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు కలిసి ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకవచ్చిన బొలోరో వాహనం ఢీకొనడంతో ఓ విద్యార్థి అక్కడికక్కేడే మృతిచెందింది. లంగర్‌హౌస్ ఎస్‌ఐ ఖలీలోద్దీన్ కథనం ప్రకారం.. గోల్కొండ రేతిగల్లికి చెందిన మహ్మాద్ ఖాదీర్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. ఖాదీర్ కుమారుడు ఎంఏ అజీజ్ అయాన్(14) 9వ తరగతి నానల్‌నగర్‌లోని నలంద పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నాడు.
స్వాతంత్య్ర వేడుకలు పురస్కారించుకుని గురువారం ఉదయం పాఠశాలకు వచ్చాడు. తిరిగి పదకొండు గంటల సమయంలో తన మిత్రుడు మహ్మద్ జాసీమ్‌తో కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. వెనుక నుంచి రేతిబౌళ్లి వైపు వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొంది. అజీజ్ అక్కడిక్కడే మృతిచెందగా, జాసీమ్‌కు తీవ్ర గాయాలైయ్యాయి. జాసీమ్‌ను చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.