క్రైమ్/లీగల్

చెరువులో మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 14: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతయిన బైక్ మెకానిక్ షేక్ సాజిత్ అలీ (18) మృతదేహం బుధవారం లభ్యమైంది. గజ ఈతగాళ్ల శ్రమ ఫలించింది. మలక్‌పేటకు చెందిన సాజిత్ అలీ స్నేహితులతో కలిసి నారపల్లి పెద్ద చెరువు వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. సరదాగా ఈత కోసం చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. బుధవారం నీటిలో మృతదేహం లభ్యం కావడంతో కుమారుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.