క్రైమ్/లీగల్

మల్కాజ్‌గిరిలో ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, జూలై 23: మల్కాజ్‌గిరి మున్సిపాల్ కార్యాలయం లంచావతారుల నిలయంగా మారిపోయింది. నిత్యం ప్రజలను లంచాలతో జలగల పీలుస్తున్న మున్సిపాల్ అధికారుల గుండెల్లో ఎసీబీ దాడులతో రైళ్లు పరుగెత్తాయి. ఏసీబీ డీఎస్పీ అచ్యుతరావు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజ్‌గిరి సర్కిల్ కార్యాలయంలో అసిస్టెంట్ టాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న దుర్గాదాస్.. మీర్జాలగూడలో ఆపార్టుమెంట్ ప్లాట్ అసిస్‌మెంట్ చేయడానికి ప్లాట్‌కు రెండువేల రూపాయల చొప్పున లంచం డిమాండ్ చేసినట్లు సమాచారంతో దాడులు చేసినట్లు తెలిపారు. అసిస్టెంట్ టాక్స్ ఇన్‌స్పెక్టర్ దుర్గాదాస్.. నాగరాజు అనే ప్రైవేట్ సహయకుడిని పెట్టుకోని బిల్డర్ల దగ్గర లంచాలు వసుళ్ల చేస్తునట్లు పక్క సమాచారంతో ఏసీబీ దాడులు చేసి రూ.30వేల నగదు, ప్లాట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో దాడులు చేయడంతో అన్ని సెక్షన్ల అధికారులు బయటకు పరుగులు తీశారు. కొంత మంది అధికారులు ఫోన్‌లను స్వీచ్ ఆఫ్ చేసుకొని వెళ్లిపోయినట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.