క్రైమ్/లీగల్

గూడపాడు, మాకులవారిపాలెంలో ఇద్దరి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఏప్రిల్ 23: మొవ్వ మండలం గూడపాడు, మాకులవారిపాలెం గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నట్లు ఎస్‌ఐ దుర్గామహేశ్వరరావు, ఎఎస్‌ఐ బివి సంతోషరావు మంగళవారం తెలిపారు. గూడపాడు గ్రామానికి చెందిన కంచర్ల రత్నబాబు(26) మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. ఇటీవల అతను పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా మేనమామ యోగేశ్వరరావు అదుపు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మంగళవారం ఉదయం గ్రామ శివారు ప్రాంతంలో నేరేడు చెట్టుకు రత్నబాబు వేలాడుతుండగా ఉపాధి పనులకు వచ్చిన కూలీలు చూసి అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించి సమాచారాన్ని మేనమామ యోగేశ్వరరావుకు తెలిపారు. వెంటనే మేనమామ పోలీసులకు సమాచారం అందించగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంత్రిపాలెం శివారు మాకులవారిపాలెంకు చెందిన కొలుసు వెంకటేశ్వరరావు మధుమేహ వ్యాధితో తీవ్ర ఇక్కట్లపాలవుతున్నాడు. జీవితంపై విరక్తి చెందిన వెంకటేశ్వరరావు(65) 21వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడిని తక్షణమే బంధువులు విజయవాడకు తరలించగా అక్కడ వైద్య చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం జరిపి మంగళవారం బంధువులకు అప్పగించినట్లు ఎఎస్‌ఐ సంతోషరావు తెలిపారు. కూచిపూడి ట్రైనీ ఎస్‌ఐ ఉషారాణి కేసుకు సహకరించారు.