క్రైమ్/లీగల్

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, ఏప్రిల్ 23: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన షాబాద్ మండల పరిధిలోని తిరుమలపూర్‌లో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలపూర్ గ్రామానికి చెందిన అంజయ్య, అనుసుజ కూతురు జ్యోతి (17) చేవెళ్లలోని వివేకనంద కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతుంది. ఇంటర్ ఫెయిలైనాని మనస్తాపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
జీడిమెట్ల, ఏప్రిల్ 23: గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహాన్ని దుందిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుందిగల్ తాండ-1లోని చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుంది. విషయం తెలుసుకున్న పో లీసులు మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుని వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.