క్రైమ్/లీగల్

ఎండ ప్రచండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమాన్‌పూర్ / మోత్కూర్, ఏప్రిల్ 19: పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వడదెబ్బకు ఇద్దరు మరణించారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన పిడుగు నర్సయ్య (56) అనే రైతు వడ దెబ్బతో శుక్రవారం మృతి చెందాడు. తన చేనులో ఈయంగీలో పెసరు పంట వేసుకోని పంటకు నీరు పెట్టేందుకు రోజువారిగా చేనులోకి వెళ్లాడు. ఉదయం చేనులోకి వెళ్లిన నర్సయ్య ఎండతీవ్రతతో ఒక్కసారిగా అస్వస్తకు గురయ్యాడు. దీంతో గమనించిన కుటంబసభ్యులు చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాల్టీ కేంద్రంలోని గాంధీ నగర్‌కు చెందిన దాసరి సోమయ్య(48) వడదెబ్బ తగిలి శుక్రవారం మృతి చెందారు. మృతుని కుంటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు సోమయ్య మేస్ర్తీ పని చేస్తుండే వాడని, రోజు వారిగా పనికి పోయొచ్చి ఎండకు తీవ్ర అస్వస్థతకు గురి కాగా భువనగిరి ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు.