క్రైమ్/లీగల్

శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 19: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, అర్చకులు కలిసి సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో ప్రధాన న్యాయమూర్తిని వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఈఓ, జేఈఓలు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటి ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్, రమేష్ బాబు, రిసెప్షన్ డిప్యూటీ ఈఓ బాలాజీ, ఓఎస్డీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.