క్రైమ్/లీగల్

బాలుడిని చిదిమేసిన కాలేజీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 5: అప్పటివరకు పాఠశాలలో తోటి విద్యార్థులతో చదువుకుని ఆడుతూ పాడుతూ ఇంటికి బయల్దేరిన ఓ బాలుడిని మృత్యురూపంలో వచ్చిన ప్రవేటు కాలేజీకి చెందిన బస్సు కబళించింది. బాలుడిని బస్సు చిదిమేసిన దృశ్యాన్ని చూసినా తోటి విద్యార్థులు ఇప్పటి దాకా తమతో సరదగా గడిపిన అతను అంతలోనే దుర్మరణం చెందడాన్ని చూసి జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్‌ఐ కొల్లు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గౌడవెళ్లి అనుబంధ గ్రామమైన బాసురేగడికి చెందిన గాధే వంశీ (13) గౌడవెళ్లి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం పాఠశాలకు వెళ్లిన వంశీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పాఠశాల నుంచి బాసురేగడిలోని తన నివాసానికి వెళ్లేందుకు బయటకు వచ్చాడు. స్కూల్ నుంచి కొద్ది దూరం వరకు రాగానే సాయివైష్ణవి జూనియర్ కళాశాలకు చెందిన బస్సు మృత్యు రూపంలో వచ్చి అతన్ని ఢీకొట్టడంతో బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న వంశీ తల్లి బంధువులు ఘటన స్థలానికి చేరుకుని తమ గారాలపట్టి మృతదేహం వద్ద రోదించిన హృదయవిదాకరమైన సంఘటన చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొల్లు నాయుడు తెలిపారు.