క్రైమ్/లీగల్

ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట: దైవ దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. సీఐ మల్లిఖార్జున్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నుండి యంహెచ్ 13 టిఎస్ 2694 నెంబర్‌గల క్లూజర్ వాహనంలో తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుండగా కొత్తకోట సమీపంలోకి రాగానే బైకును తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. అందులో 14 మంది ప్రయాణిస్తుండగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందాడు. స్వప్న (40), శారద (40), డ్రైవర్ దత్తాత్రేయ (45) అనే వ్యక్తితో పాటు మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ ద్వారా వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ తెలిపారు.
*చిత్రం...వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన వాహనం,