క్రైమ్/లీగల్

‘సమత’ కేసు తుది తీర్పు 30కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 27: ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ అటవీ ప్రాంతంలో సమతపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులో తుది తీర్పును ప్రత్యేక కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. నవంబర్ 24న ఒంటరిగా వెళ్తున్న సమతపై ముగ్గురు నిందితులు పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా అలజడి రేపిన విషయం వ్దిఒతమే. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు డిసెంబర్ 11న ఆదిలాబాద్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరుపర్చగా అదే నెల 14న చార్జిషీట్ దాఖలు చేశారు. బాధితురాలి తరఫున కోర్టులో 25 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుల తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇచ్చారు. అయితే నిందితుల తరపున సాక్ష్యం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు.