క్రైమ్/లీగల్

పరిగిలో బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, జనవరి 19: దిశ సంఘటన మరువక ముందే వికారాబాద్ పరిగి మున్సిపల్ కేంద్రంలో ఓ మైనర్ (11) బాలికను యువకుడు అత్యాచారం చేసిన సంఘటన స్థానికంగా సంచలనం రేగింది. పరిగి మున్సిపల్ కేంద్రంలోని బీసీ కాలనిలో (11) సంవత్సరాల మైనర్ బాలికను అదే కాలనిలో ఉంటున్న సాయి (24) అనే యువకుడు శనివారం అత్యాచారం చేశాడు. ఇంట్లోకి వచ్చిన బాలిక ఓ దగ్గర కూర్చోని బాధతో ఉండటం గమనించిన తాత అసలు విషయం తెలుసుకున్నాడు. అప్పటికే బాలికకు అధికంగా రక్తస్త్రావం అవుతుండటం వలన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం గురించి నగరంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.
యువకుడిని పట్టించిన స్థానికులు
విషయం తెలిసిన వెంటనే స్థానికులు అందరు కలసి సాయి అనె యువకుడిని పట్టుకుని చితక బాదినారు. తరువాత పోలీస్‌లకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకని యువకుడిని స్టేషన్‌కు తరలించారు. మైనర్ బాలిక పై అత్యాచారం చేశారన్న విషయం తెలియగానే ప్రజలు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగి పోయారు. కామాంధుడైన యువకుడికి తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అప్పటికే పోలీస్‌ల ఆధినంలో ఉండటం వలన అక్కడే ఆగిపోయారు.
ఠాణా ఎదుట ధఠ్నా
ఆదివారాం ఉదయం ప్రజలు పరిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడిని అప్పచెప్పాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు అక్కడికి చేరుకుని ఉరితీయాలని డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు పోలీసులు అత్యాచారం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశిలించారు.
ఉరి తీయాల్సిందే : ఎమ్మెల్యే కొప్పుల
అత్యాచారం చేసిన యువకుడిని ఉరితీయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి డిమండ్ చేశారు. ఇంత జరుగుతున్న మహిళలపై రోజురోజుకూ జరుగుతున్న అత్యాచారాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో అదేవిధంగా ముఖ్యమంత్రితో ఈ విషయం చెప్పనున్నట్లు చెప్పారు.