మరువలేని విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడివి శేష్, రెజీనా కాసాండ్రా, నవీన్‌చంద్ర ప్రధాన తారాగణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్‌పై రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ -ఎవరు. దర్శకుడు వెంకట్ రామ్‌జీ తెరకెక్కించిన సినిమా ఆగస్టు 15న విడుదలై విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నవీన్‌చంద్ర మాట్లాడుతూ -అరవిందసమేత చిత్రం తరువాత అంతా బాల్‌రెడ్డి అని పిలిస్తే, ఎవరు సినిమా తరువాత అంతా అశోక్ అని పిలుస్తుండటం హ్యాపీగా ఉందన్నాడు. ఆర్టిస్టుల గురించే కాదు, ప్రతి క్రాఫ్ట్ గురించి గొప్పగా మాట్లాడుతుండటం చిత్రబృందానికి గర్వంగా ఉందన్నాడు. శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ -మంచి టీంవర్క్‌తో ఇంతదూరం ట్రావెల్ చేశాం. ఈ రెస్పాన్స్ హ్యాపీగా ఉంది. ఎవరు? కోసం చేసిన స్పెషల్ సాంగ్ త్వరలోనే విడుదల చేస్తాం. శేష్‌తో కలిసి మళ్లీ మేజర్ సినిమాకి వర్క్ చేస్తుండటం ఆనందంగా ఉందన్నాడు. సినిమాటోగ్రాఫర్ పచ్చిపులుసు మాట్లాడుతూ -అరకులో ఓ థియేటర్ ఉంది. అక్కడా ఎవరు? సినిమానే రన్నవుతుందంటూ స్నేహితులు ఫోన్లు చేస్తుంటే ఆనందంగా ఉందన్నాడు. నిహాల్ మాట్లాడుతూ -సినిమా విడదలైన దగ్గర్నుంచీ తన ఫోన్ మోగుతూనే ఉందని, ఇంత మంచి అప్రీసియేషన్ రావడం ఆనందంగా ఉందన్నాడు. అడివి శేష్ మాట్లాడుతూ -గూఢచారి లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను చాలాచోట్ల ఎవరు క్రాస్ చేసిందన్న సమాచారం వస్తోంది. నేను చేసిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. వినాయక చవితి నుంచి సినిమా నాలుగో వారంలోకి ఎంటరవుతోంది. ఇంకా స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఇంతమంచి హిట్టు ఇచ్చినందుకు ఆడియన్స్‌కి ధన్యవాదాలు అన్నాడు.