పెర్ఫెక్ట్ థ్రిల్లర్.. ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరు? చిత్రం ఓ పర్ఫెక్ట్ థ్రిల్లర్ అంటూ నిర్మాత దిల్‌రాజు కితాబునిచ్చారు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని మొదలెట్టిన అడివి శేష్, క్షణంతో హీరోగా ఇమేజ్ సాధించి గూఢచారి, ఎవరు? చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు. రాణింపునకు బ్యాక్‌గ్రౌండ్ కాదు ప్రతిభ ఉంటే చాలని శేష్ నిరూపించాడన్నారు. అడివి శేష్, రెజీనా, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రలుగా వెంకట్ రాంజీ తెరకెక్కించిన చిత్రం -ఎవరు? పీవీపీ నిర్మించిన సినిమా గురువారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్రబృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు మాట్లాడుతూ -ఫైట్ లేదు. పాట లేదు. కేవలం థ్రిల్‌నిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ పెద్ద హిట్ చేశారన్నారు. నటిగా ఎప్పుడో నిరూపించుకున్న రెజీనాలోని టాలెంట్‌ను దర్శకుడు వెంకట్ మరింత తీసుకోగలిగాడని కితాబునిచ్చారు. చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ, ఇలాంటి చిత్రాలు తన బ్యానర్‌లోనూ నిర్మించాలని ఉందని, ఆ బాధ్యతను శేష్ నిర్వహించాలని అన్నారు. హీరో శేష్ మాట్లాడుతూ -సినిమా విడుదలకు సపోర్ట్ చేసిన దిల్‌రాజుకు థాంక్స్ చెప్పారు. ఆయన నిర్మించిన ఎవడు? చిత్రంలో విలన్‌గా నటించాలనుకుంటే అవకాశం దొరకలేదని, ఇప్పుడు ఎవరు? వచ్చిన తరువాత ఆయనే ఫోన్ చేసి మా బ్యానర్‌లో సినిమా ఎప్పుడు చేస్తున్నావని అడగటం ఆనందంగా ఉందన్నాడు. గూఢచారికి మూడు రెట్లు ఎవరు? చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చాయని, సినిమాను అన్ని విధాలా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారన్నారు. టీం సపోర్ట్‌తోనే ఈ విజయం సాధ్యమైందని, సక్సెస్‌ని అంతా ఎంజాయ్ చేస్తున్నామని దర్శకుడు వెంకట్ రాంజీ అన్నారు. మురళీశర్మ, రెజీనా ఆనందం వ్యక్తం చేస్తూ -ఇంటర్వెల్ బాంగ్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు బయటకు చెప్పొద్దంటూ విజ్ఞప్తి చేశారు.