బాలీవుడ్పై దిల్రాజు ఫోకస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు కథలపై బాలీవుడ్ ఫోకస్ పెట్టడంతో, బాలీవుడ్పైనా తెలుగు నిర్మాతల ఫోకస్ పెరిగింది. తెలుగులో సక్సెస్ఫుల్ నిర్మాతగా ఎదిగిన దిల్రాజు, ఇటీవలి కాలంలో బాలీవుడ్ నిర్మాణరంగంపై ఫోకస్ పెడుతున్నట్టే కనిపిస్తోంది.తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న ఎఫ్-2 చిత్రాన్ని బోనీకఫూర్తో కలిసి రీమేక్కు సెట్ చేశాడు. నానికి మంచి పేరుతెచ్చిన ‘జెర్సీ’ని సైతం బాలీవుడ్కు సెట్ చేయడానికి దిల్ రాజు ట్రై చేస్తున్నట్టు సమాచారం. నిర్మాత కరణ్జోహార్ ‘జెర్సీ’ హిందీ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న నేపథ్యంలో -ఆ ప్రాజెక్టులో దిల్ రాజు భాగస్వామి కావొచ్చన్న మాట వినిపిస్తోంది. నిజానికి బాలీవుడ్పై దిల్ రాజు ఫోకస్ -్భరతీయుడు 2 నుంచే మొదలైంది. శంకర్- కమల్హాసన్ కాంబినేషన్లో భారతీయుడు-2ను ప్లాన్ చేసినా, అది సెట్ కాలేదు. ఇదిలావుంటే -అర్జున్రెడ్డి రీమేక్ కబీర్సింగ్ భారీ హిట్టందుకుంది. తాజాగా రామ్చరణ్, అల్లు అర్జున్ నటించిన ‘ఎవడు’ సినిమా బాలీవుడ్కు వెళ్తోందని వినిపిస్తోంది. చిత్రమేమంటే -దిల్రాజు, బాలీవుడ్ నిర్మాత నిఖిల్ అద్వానీ కలసి రీమేక్ చేస్తారట. దర్శకుడిగా మిలాప్ జవేరీకి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వినిపిస్తోంది. త్వరలోనే హీరోలను ప్రకటించే అవకాశం లేకపోలేదు.