శ్రీహరిని మరిపిస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం -రాజ్‌ధూత్. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్- కార్తీక్ దర్శకత్వంలో ఎమ్‌ఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా టీజర్ విడుదలైంది. కార్యక్రమంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ -శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా పరిచయమవ్వడం హ్యాపీగా ఉంది. టీజర్, రషెస్‌లో మేఘామ్ష్ పెర్ఫార్మెన్స్ ఈజ్ కనిపిస్తోంది. తండ్రిని మించిన తనయుడవుతాడన్న నమ్మకం కలుగుతోంది. మంచి స్టార్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. మేఘామ్ష్, నా కుమార్తె శివాత్మికకు తగ్గ మంచి కథ కూడా సిద్ధమైంది అని ప్రకటించారు. శాంతి శ్రీహరి మాట్లాడుతూ -తెలుగు ప్రేక్షకులు బావ (శ్రీహరి)ని గుండెల్లో పెట్టుకున్నట్టే మేఘామ్ష్‌నీ చూసుకుంటారని ఆశిస్తున్నా. హీరోగా పరిచయం చేస్తున్న నిర్మాతకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. హీరో మేఘామ్ష్ మాట్లాడుతూ -హీరోగా పరిచయం కావడానికి రాజ్‌ధూత్ కథ. దొరకడం హ్యాపీగా ఉంది. దర్శకులిద్దరూ క్లారిటీతో తెరకెక్కించి మంచి అవుట్‌పుట్ తీశారు. టెక్నికల్‌గానూ సినిమా హైలైట్ అవుతుంది. వచ్చే నెలలో మీ ముందుకొస్తా. ఆశీర్వదించండి’ అన్నారు. నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ -మేఘామ్ష్‌ని హీరోగా పరిచయం చేసే చాన్స్ రావడం హ్యాపీగా ఉంది. శాంతి నమ్మకాన్ని నిలబెడతా. సినిమా సక్సెస్‌పై ధీమాగా ఉన్నాం. మేఘామ్ష్ రెండో చిత్రం కూడా ఈ బ్యానర్‌లోనే ఉంటుంది’ అన్నారు. చిత్ర దర్శకులు అర్జున్-కార్తీక్ మాట్లాడుతూ -రచయితల నుంచి దర్శకులుగా పరిచయమవుతున్న చిత్రమిది. పోస్టర్, టీజర్ చూస్తేనే కథ అర్థమవుతుంది. హీరో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీదున్నాడు. పక్కనే రాజ్‌ధూత్. ఇది చాలు, కథను అంచనా వేయడానికి. అందరికీ నచ్చే సినిమా అవ్వడం ఖాయమన్నారు. హీరోయిన్ నక్షత్ర, ఏడిద శ్రీరామ్, నటులు రవివర్మ, సుదర్శన్ తదితరులు మాట్లాడారు.