నిజాలేమిటో తెలియాలనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య కొందరు మీడియా ముందుకెళ్లి ‘మా’పై లేనిపోని అభియోగాలు చేస్తున్నారు. వాళ్లంతా నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. మేం ఏంచేశామో అందరికీ తెలుసు. మేం తెల్లని వస్త్రంలా స్వచ్ఛంగా ఉన్నాం’ అన్నారు శివాజీరాజా. ఈనెల 10న జరగబోయే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’(మా) ఎన్నికలలో శివాజీరాజా అధ్యక్షుడిగా పోటీచేస్తున్నారు. ఈ సందర్భంగా శివాజీరాజా ప్యానల్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నరేష్, రాజశేఖర్, జీవిత... వీళ్లంతా మీడియా ముందుకెళ్లే ‘మా’గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. అవి వినీ ఊరుకుంటే మేమేదో తప్పుచేశామని ప్రజలు అనుకుంటారు. అందుకే మేంకూడా మీడియా ముందుకు రావాల్సివచ్చింది. ఈమధ్య రకరకాల మాటలు వినాల్సివస్తోంది. అవి విని మా కుటుంబం బాధపడింది. మేం ఎప్పుడూ తప్పుచేయలేదు. ‘ఈసారి కూడా మీరే ఉండండి’అని ‘మా’ కార్యవర్గ సభ్యులంతా అడిగారు. అందుకే ఇష్టంలేకపోయినా పోటీచేస్తున్నా. ‘మా’నిధులకోసం చిరంజీవిగారితో ఓ కార్యక్రమం ఏర్పాటుచేశాం. రిహార్సల్స్‌కోసం నరేష్‌ని పిలిచాం. కానీ అప్పుడు రాలేదు. ‘మా’సభ్యులెవరైనా పుట్టినరోజు జరుపుకుంటే, వాళ్ల ఇంటికెళ్లి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. రాజశేఖర్, జీవిత కూడా నిజాలు తెలుసుకుని మాట్లాడండి. యాభై మంది కళాకారులు అవకాశాలు లేక బాధపడుతుంటే, ఓ అజ్ఞాత వ్యక్తి సహాయంతో ఏడాదికి ఆరునెలలపాటు నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తున్నాం. పింఛను రూపంలో ఇస్తున్న రూ.5 వేలని రూ.7,500 చేయాలని నిర్ణయించుకున్నామ’న్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘పేదవాళ్లకోసం, వాళ్లకు మంచిచేయాలన్న ఉద్దేశంతో శివాజీరాజాని ఈసారి ఎన్నికల్లో పోటీచేయమని మేమే బలవంతం చేశాం. కొన్ని మంచి పనులు కొనసాగాలంటే తనే రావాలి’’అన్నారు. నాగినీడు, ఎస్వీ కృష్ణారెడ్డి, రాజీవ్‌కనకాల, పరుచూరి వెంకటేశ్వరరావు, పృథ్వీ, రఘుబాబు, రాజ్‌తరుణ్, రాజారవీంద్ర, బెనర్జీ, రవిప్రకాష్, ఏడిద శ్రీరాం, భూపాల్‌రాజ్, వెంకట గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.