సమాజాన్ని ‘ప్రశ్నిస్తా’డట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడు నిర్మాత దర్శకుడు పి సత్యారెడ్డి తన తనయుడు మనీష్‌బాబుని హీరోగా పరిచయం చేస్తూ, రాజా వనె్నంరెడ్డి దర్శకత్వంలో జనం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ప్రశ్నిస్తా’. సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో తమ్మారెడ్డి భరద్వాజ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ ‘సినిమా ట్రైలర్ చూస్తుంటే రాజావనె్నంరెడ్డి స్టైల్‌మార్చి చేసినట్టు అనిపించింది. సత్యారెడ్డి తన కొడుకు మనీష్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. కొత్త ప్రయత్నం చేసిన దర్శక నిర్మాతలకు అభినందనలు. మనీష్‌కు ఈ సినిమా గుర్తింపుతేవాలని కోరుకుంటున్నా’ అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ‘ట్రైలర్ చూస్తుంటే డెఫినెట్‌గా సినిమా సూపర్‌హిట్ అవుతుందనిపిస్తుంది. సినిమాల్లోవున్న సత్యారెడ్డి, ఆయన వారసుడిని ఇండస్ట్రీకి తెస్తున్నారు. పట్టుదల కలిగిన మనీష్ మంచి హీరోగా ఎస్టాబ్లిష్ అవుతాడు’ అని ఆకాంక్షించారు. హీరో మనీష్ మాట్లాడుతూ ‘నా పెర్ఫార్మెన్స్ క్రెడిట్ అంతా దర్శకుడు వనె్నంరెడ్డిదే. రాజేంద్రకుమార్ మంచి కథ అందించారు అన్నారు. దర్శకుడు రాజా వనె్నంరెడ్డి మాట్లాడుతూ ‘సాధారణంగా నా సినిమాల్లో ఫ్యామిలీ టచ్, కామెడీ టచ్ ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్‌లో ఎవరో చెబితేకానీ కొన్ని పనులుచేయం. అలాంటి ఘటనలను ఆధారంగాచేసుకుని కథను తయారు చేసుకున్నాం. అందరి సపోర్ట్ కోరుతున్నా అన్నారు. ఈ సినిమా మంచి హిట్టవుతుందన్న నమ్మకాన్ని ప్రదర్శించాడు.