19న మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాణి జంటగా సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో ఆదర్శ చిత్రాలయ పతాకంపై ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మించిన చిత్రం మలుపు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 19న విడుదలకు సిద్ధమైన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ, మా పెద్దబ్బాయి సత్య టాలెంట్‌మీదున్న నమ్మకంతో ఈ సినిమాను నిర్మించానన్నారు. అమెరికన్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్సు చేశాడని, తన మిత్రుల జీవితంలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని, ఆది సినిమాకు న్యాయం చేశాడని అన్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూశామనే ఫీలింగ్ కాకుండా మంచి సినిమా చూశామన్న నమ్మకం కలుగుతుందని, తప్పకుండా సినిమా మంచి విజయం సాధిస్తుందన్నారు. దర్శకుడు సత్యప్రభాస్ మాట్లాడుతూ, మా నాన్న లేకపోతే ఈ సినిమా చేసేవాడినే కాదని, సినిమాకోసం బాగా ఖర్చుపెట్టాలని, స్క్రిప్టుని నమ్మి సినిమా చేశారని, ఆదికి వేరే మంచి అవకాశాలు వచ్చినా కూడా ఈ సినిమా చేశాడని అన్నారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారనే నమ్మకంతో ఈ సినిమా చేశామని అన్నారు. హీరో ఆది మాట్లాడుతూ, డిసెంబర్ 31 రాత్రి ఏం జరిగింది అనే ఆసక్తికర అంశంతో ఈ సినిమా వుంటుందని, 19న రిలీజ్ చేస్తున్నామని అన్నారు. తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిక్కీ గల్రాణి, ప్రగతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.