కేసిఆర్‌ను కలిసిన గాయని సుశీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రజల గుండెల్లో నిత్యం తన పాట ద్వారా పలకరించే సినీ నేపథ్య గాయని పి.సుశీల హైదరాబాద్‌లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఐదురోజులపాటు ప్రపంచ శాంతికై ముఖ్యమంత్రి అయుత చండీ మహాయాగాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు అభినందించారు. ప్రజలకోసం మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సిఎంను కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ గాయని పి.సుశీల అని, ప్రజలకోసం ముందుకు రావడం మరింత ఆనందాన్నిస్తోందని అన్నారు. అనంతరం పి.సుశీలకు ముఖ్యమంత్రి శాలువా కప్పి, జ్ఞాపికతో సత్కరించారు.