నువ్వు ఎవరో నేను ఎవరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమన్‌శెట్టి, రూపశ్రీ ప్రధాన తారాగణంగా దేవికృష్ణ సినిమా పతాకంపై వి.ఎ.కె.్భస్కర్ దర్శకత్వంలో శాబోలి రమాగౌడ్ రూపొందిస్తున్న చిత్రం ‘నువ్వు ఎవరో నేను ఎవరో’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి సెన్సార్‌కు పంపనున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ఈనెల మూడవ వారంలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిగి, నెలాఖరుకు సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, కౌబాయ్‌గా పొట్టి చిట్టిబాబు కామెడీ హైలెట్‌గా వుంటుందని, సినిమా మొదటినుండీ చివరిదాకా నవ్వులతో ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. చిత్రం శ్రీను, శిల్ప, మేఘనారాయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు:దేవికృష్ణ, సంగీతం:రమణ సాకు, కెమెరా:తిరుమల్, ఎడిటింగ్:సురేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.ఎ.కె.్భస్కర్.