22న రణస్థలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్, షాలు, మేఘనా చౌదరి ప్రధాన తారాగణంగా శ్రీ లక్ష్మీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఆది అరవల దర్శకత్వంలో కావలి రాజు రూపొందించిన చిత్రం రణస్థలం. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 22న విడుదలకు సిద్ధమైంది. మంగళవారం ఉదయం ఆడియో సక్సెస్ వేడుకను హైదరాబాద్ చాంబర్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆది మాట్లాడుతూ- నిర్మాత ఇచ్చిన ప్రోత్సాహంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని రూపొందించామని, ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రతి ఒక్కరూ సినిమాకు సహకరించారని, ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు, పాటలకు మంచి ఆదరణ లభించిందని సినిమా కూడా అందరికీ నచ్చుతుందని తెలిపారు. రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్రాన్ని క్వాలిటీ ప్రధానంగా రూపొందించామని, మేకింగ్ అంతా పూర్తిగా పూరి స్టైల్‌లో వుంటుందని, ముఖ్యంగా ఛత్రపతి శేఖర్, చిత్రం శ్రీనులమధ్య ఓ వైవిధ్యమైన కథనమే రణస్థలం అని నిర్మాత రాజు అన్నారు. ఈ సినిమాకోసం ప్రతి టెక్నీషియన్ చక్కగా పనిచేయడంవల్ల బాగా వచ్చిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాజ్, షాలు, మేఘనా చౌదరి, సత్యానంద్ ప్రభాకర్, సంతోషమ్మ, షామీర్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.