బిజినెస్

ప్రభుత్వ నిర్మాణాలకు తగ్గింపు ధరకే సిమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 16: పేదలకు ఇళ్ల నిర్మాణం సహా ప్రభుత్వం చేపట్టే పనులు, పోలవరం ప్రాజెక్ట్‌కు సరఫరా చేసే సిమెంట్ ధరలు తగ్గిస్తున్నట్లు సిమెంట్ కంపెనీలు ప్రకటించాయి. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో వివిధ సిమెంట్ కంపెనీల యజమానులు, ప్రతినిధులు సమావేశమయ్యారు. సిమెంట్ ధరలు తగ్గించాలని సీఎం జగన్ వారిని కోరారు. ఈమేరకు పొజొలానా పోర్టబుల్ సిమెంట్ (పీసీసీ) బస్తా ధర రూ. 225, ఆర్డినరీ పోర్ట్ సిమెంట్ ధరను రూ. 235గా ఇవ్వాలని వారు నిర్ణయించారు. 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో ఏ సంవత్సరంతో పోల్చినా ఈ ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్‌లో సిమెంట్ బస్తా ధర రూ. 380 వరకు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు చేపడుతున్న పనుల కోసం ఈ ఏడాది అవసరమైన సిమెంట్ వివరాలను కంపెనీ ప్రతినిధులకు అధికారులు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 40లక్షల మెట్రిక్ టన్నులు, పంచాయతీరాజ్ శాఖకు 25లక్షల మెట్రిక్ టన్నులు, జలవనరుల శాఖకు 16.57 లక్షల మెట్రిక్ టన్నులు, మున్సిపల్ శాఖకు 14.93 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 1,19,43,237 మెట్రిక్ టన్నుల మేర వినియోగం ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. అలాగే పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. సిమెంట్ ఉత్పత్తి, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. పేదలకు 26.6 లక్షల ఇళ్లపట్టాలు పంపిణీ చేయనున్నామని, వీటిని తీసుకున్న వారితో పాటు సొంతంగా స్థలాలు, పట్టాలు ఉన్న పేదలకు పెద్దమొత్తంలో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తక్కువ ధరలతో ఇచ్చే సిమెంట్ బ్యాగ్ ప్రత్యేకంగా వేరే రంగులో ఉండాలని సూచించారు. అలాగే ప్రభుత్వ విభాగాలు తమ అవసరాలను సంబంధిత జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాయని, కలెక్టర్ ద్వారా సిమెంట్ పంపిణీ అవుతుందని స్పష్టం చేశారు. నాణ్యత నిర్థారణ అయ్యాకే చెల్లింపులు జరుగుతాయని కంపెనీలకు తేల్చిచెప్పారు.
పేదలకు ఇళ్ల నిర్మాణం సహా వివిధ ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్ట్‌కు సిమెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు సీఎంకు తెలిపారు. సమస్యలు ఎదురైతే పరిష్కారానికి కంపెనీల తరపున ఇద్దరు లేదా ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి సహకరిస్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు. సమావేశం లో జువారి, భవ్య, సాగర్, కేపీసీ, రైన్, భారతి, అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యు, శ్రీచక్ర, ఇండియా, మైహోం, రాంకో, పెన్నా, దాల్మియా, ఆదిత్య బిర్లా, చెట్టినాడ్, పా ణ్యం, పరాశక్తి, ఎన్‌సీఎల్, తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
*చిత్రం... సిమెంట్ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి