బిజినెస్

ఏపీలో పెట్టుబడులకు జర్మన్ సుముఖత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 9: రాష్ట్రంలో పెట్టుబడులకు ఇండో జర్మన్ బిజినెస్ కౌన్లిల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో జర్మన్ కాన్సుల్ జనరల్ కెరిన్ క్రిస్టినా మరియా స్టోల్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించారని ఈ సందర్భంగా సీఎం జగన్‌ను కెరిన్ అభినందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్న ఆమె ప్రశంసలు కురిపించారు. ఏపీలో పెట్టుబడులకు సానుకూలత వ్యక్తం చేశారు. వీలైనంత త్వరలో ఇండో- జర్మన్ బిజినెస్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. భారత్- జర్మనీల మధ్య సన్నిహిత సంబంధాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌తో తమ దేశానికి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. వివిధ సంక్షేమ పథకాలతో పాటు అవినీతి రహిత, పారదర్శక విధానాల కోసం పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. గత 9 నెలలుగా రాష్ట్రంలో సీఎం అమలు చేస్తున్న పథకాలను తెలుసుకున్న కెరిన్ అభినందించారు. భారత్, జర్మనీల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతో పాటు సురీద్ఘకాలంగా జర్మనీతో రాష్ట్రానికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఇండో జర్మన్ బిజినెస్ కౌన్సిల్ ఆసక్తిగా ఉందన్నారు.
ఏపీలో పెట్టుబడులకు తమ కంపెనీలను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. వీలైనంత త్వరలో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అతిపెద్ద పవన విద్యుత్ మాన్యు ఫాక్చరింగ్ కంపెనీ సీమెన్స్- గమేసాతో పాటు జర్మనీ సహకారంతో నడుస్తున్న పలు విండ్ పవర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీల గురించి కెరిన్ ప్రస్తావించారు. జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ (పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం)ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ది జర్మన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (కేఎఫ్‌డబ్ల్యు) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. జర్మన్ సహకారంతో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్ట్‌లను వివరించారు. ఏపీ, జర్మనీల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, సాంస్కృతిక మార్పిడి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయదలచిన 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను విశదీకరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా పని సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయదలచిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ గురించి చర్చించారు. మరోవైపు పాలిటెక్నిక్, బీటెక్‌లో పాఠ్య ప్రణాళికను మార్పు చేస్తున్నామని, కొత్తగా అప్రెంటీస్ విధానం అమల్లోకి తెచ్చామన్నారు. సమావేశంలో సయాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
*చిత్రం...ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన జర్మన్ కాన్సుల్ జనరల్ కెరిన్ స్టోల్