బిజినెస్

రూ.10కే ‘శివ భోజనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 26: పేదలకు పది రూపాయలకే భోజనం అందించే అపూర్వమైన పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ‘శివ్ భోజన్’ పేరిట ఈ పథకాన్ని ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరంభించింది. శివ్ భోజన్ మధ్యాహ్న భోజన పథకాన్ని మహారాష్ట్ర మంత్రి అస్లామ్ షేక్ రద్దీ ఎక్కువగా ఉండే నాయిర్ ఆసుపత్రి వద్ద ప్రారంభించారు. బండ్ర కలెక్టర్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే లాంఛనంగా ప్రారంభించారు. ఇంకా మంత్రులు అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బుల్ పుణే, నాసిక్‌లో లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించారు. ప్రతి జిల్లా కేంద్రంలో మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, స్థానిక నాయకులు ఈ శివ్ భోజన్ క్యాంటీన్లను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. శివ్ భోజన్ ప్లేటులో రెండు చపాతిలు, ఒక ఆకుకూర, అన్నం, పప్పు ఉంటుందని చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేదలకు అందుబాటులో ఉంటుందని వారు వివరించారు. ప్రతి క్యాంటీన్‌లో సుమారు 500 ప్లేట్ల శివ్ భోజన్ పథకాన్ని పేదలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని అధికారులు తెలిపారు.
తొలి రోజునే అనూహ్యమైన స్పందన లభించిందని, పేదలు బారులు తీరి ఖరీదు చేశారన్నారు. ఇంత తక్కువ ధరకు అందిస్తున్నందున పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వాన్ని అనేక మంది ప్రశంసించారని ఆయన తెలిపారు.