బిజినెస్

మిర్చి, పసుపు, ఉల్లికి కనీస మద్దతు ధరల ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 9: మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలకు సంబంధించి కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. మిర్చికి క్వింటాల్‌కు 7 వేల రూపాయలు, పసుపునకు 6350 రూపాయలు, ఉల్లికి 770 రూపాయలు, చిరుధాన్యాలు (కొర్రలు, అండుకొర్రలు, అరికలు, వరిగలు, ఊదలు, సామలు)కు 2500 రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటించింది. వివిధ పంటలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల జాబితాలో లేని ఈ పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఇందుకు అవసరమయ్యే ఖర్చును ధరల స్థిరీకరణ నిధుల నుంచి సర్దుబాటు చేస్తారు.