బిజినెస్
రూ.3.36 లక్షల కోట్లు నష్టం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 January 2020
న్యూఢిల్లీ, జనవరి 6: మధ్య ప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా వరుసగా రెండు సెషన్లలో భారతీయ మార్కెట్లు భారీగా నష్టపోవడం వల్ల దాదాపు 3.36 లక్షల కోట్ల రూపాయల మేర ఇనె్వస్టర్ల సంపద హరించుకుపోయింది. వరుసగా రెండో సెషన్లో కూడా ఈక్విటీ మార్కెట్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. బీఎస్ఈ దాదాపు 800 పాయింట్లు నష్టపోవడం వల్ల ఇక్కడ లిస్టయిన కంపెనీల ఉమ్మడి సంపద 3 లక్షల 36 వేల కోట్ల రూపాయల మేర ఆవిరైపోయింది. ఈ వారంలో భారతీయ మార్కెట్ లావాదేవీలు ప్రతికూల పథంలోనే మొదలయ్యాయి.