బిజినెస్

ఏపీలో పెట్టుబడులకు జపాన్ దిగ్గజం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వాహన రంగంలో భారీ పెట్టుబడులకు జపాన్ దిగ్గజ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు బ్యాంక్ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో తొలివిడత చర్చలు జరిపారు. హైదరాబాద్ లేక్‌వ్యూ అతిథిగృహంలో సోమవారం బిజినెస్ అవుట్‌రీచ్ కార్యక్రమం సందర్భంగా మంత్రితో బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ అయింది.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ఏ రంగంలో పెట్టుబడులకైనా ఏపీలో ఉన్న అనుకూల వాతావరణం గురించి మంత్రి మేకపాటి ప్రతినిధులకు వెల్లడించారు. సంక్షేమం, పరిశ్రమల వృద్ధిని సమాన స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించారు. వచ్చే ఏడాది నాటికి పరిశ్రమలకు అనువైన పారదర్శక విధానాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించారు. యువతకు ఉపాధి, వౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలైన 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు, యువత ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు వంటి అంశాలపై మంత్రి ప్రతినిధులకు వివరించారు. ఆ నిర్ణయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేయటమే కాకుండా గొప్ప నిర్ణయాలని బ్యాంకు ప్రతినిధులు కొనియాడారు.
పారిశ్రామిక వృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముందుకు సాగేందుకు ఆసక్తితో ఉన్నట్లు ప్రతినిధులు వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. రెండు వారాల్లో మరో విడత భేటీ అయి స్పష్టమైన ప్రణాళికతో వివరాలు అందించాలని నిర్ణయించారని వివరించారు. ఆ తరువాత సాఫ్ట్‌బ్యాంక్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. అందుకు ప్రతినిధి బృందం అంగీకరించింది.
బిజినెస్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో పలువురు పారిశ్రామిక వేత్తలతో మంత్రి భేటీలు నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు.
ఏటీఏ అలక్ట్రా ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ సీఈఒ బిజు థామస్, విష్ణు గ్రూప్ వైస్‌చైర్మన్ రవిచంద్రన్, డెలాయిట్ ప్రతినిధి కౌశల్, జాన్సన్ అండ్ జాన్సన్ వైస్ ప్రెసిడెంట్, ఐఐఎం ప్రతినిధులు, ఏపీ బ్రాండింగ్ ప్రమోషన్‌పై పీఆర్ ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.