బిజినెస్

జీఎస్టీ ఆదాయానికి భారీ గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో నడుస్తుండటంతో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పైనా పడింది. గత నాలుగు నెలల్లో చూస్తే రెండు నెలలు కనీస నెలవారీ రక్షిత ఆదాయాన్ని రాష్ట్రం పొందలేకపోయింది. ప్రధానంగా ఆటోమొబైల్ అమ్మకాలు క్షీణించటం, స్టీల్, సిమెంట్, ఎరువుల ధరలు తగ్గడంతో కనీస నెలవారీ నిర్దేశిత రక్షిత ఆదాయ లక్ష్యానికి రాష్ట్రం చేరుకోలేకపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతినెలా కనీస నిర్దేశిత రక్షిత ఆదాయాన్ని రూ.1893 కోట్లుగా నిర్ణయించారు. దీనికంటే ఎంత తక్కువగా వస్తే అంత నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్‌లో ఆదాయాభివృద్ధి బాగున్నా మరుసటి నెలల్లో గణనీయంగా తగ్గుతూ వస్తోంది. మే, జూన్ నెలలు నిర్దేశిత రక్షిత ఆదాయాన్ని అందుకోకపోవడంతో ఈ రెండు నెలలకు కలిసి రూ. 516 కోట్ల నష్టపరిహారాన్ని కేంద్రం నుంచి కోరుతున్నట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2018-19 ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో రూ. 6896.56 కోట్ల ఆదాయం వస్తే, అది ఈ ఏడాది కేవలం 6.51 శాతం వృద్ధితో రూ. 7345.69 కోట్లకు మాత్రమే పరిమితమైంది. ఆటోమొబైల్ అమ్మకాలు భారీగా క్షీణించడం, ఉక్కు రేట్లు 10 నుంచి 15శాతం తగ్గడం, సిమెంట్
బస్తా రేటు రూ. 20 వరకు తగ్గడంతో జీఎస్టీ ఆదాయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్ల ఎరువుల అమ్మకాలు కూడా పడిపోయాయి. జూలైలో ఆదాయం నిర్దేశిత లక్ష్యానికి మించి రూ. 1962.57 కోట్లు వచ్చినా ఆగస్టుకు సంబంధించి ఇప్పటివరకు వస్తున్న గణాంకాలు అంత ఆశాజనకంగా లేవంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది ఆదాయంలో రెండంకెల వృద్ధిరేటు నమోదు చేయడం కష్టమంటున్నారు. నిర్దేశిత రక్షిత ఆదాయం ప్రకారం చూసుకున్నా ఈ ఏడాది కనీసం రూ. 22,715.88 కోట్లు రావాల్సి ఉందని, కానీ ప్రస్తుత గణాంకాలను చూస్తే ఈ మొత్తాన్ని దాటడం సాధ్యం కాకపోవచ్చని అధికారులు వివరించారు.