జాతీయ వార్తలు
భోపాల్లో 11మంది జల సమాధి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 13 September 2019
భోపాల్: మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుని 11మంది జల సమాధి అయ్యారు. ఖట్లాపూర్ ఘాట్ వద్ద ఓ బోట్ మునిగిపోవటంతో 11మంది చనిపోయారు. మరో ఐదుగురిని సహాయక బృందాలు రక్షించాయి. ప్రస్తుతం విస్తత్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఏఎస్పీ అఖిల్ పటేల్ తెలిపారు. గణేష్ నిమజ్జనం కోసం 16మందిని తీసుకువెళుతున్న ఈ బోట్ ఒక్కసారిగా మునిగిపోయింది. గజ ఈతగాళ్లు స్పందించి ఐదుగురిని కాపాడారు.