రాష్ట్రీయం

22వరకూ ఏపి అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిఏసి సమావేశంలో చర్చ జగన్ గైర్హాజరు
హైదరాబాద్, డిసెంబర్ 17: రాష్ట్ర శాసనసభ కార్యనిర్వాహక సలహా మండలి సమావేశం గురువారం ఉదయం ఇక్కడ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, వైకాపా నుంచి జ్యోతుల నెహ్రూ, జి శ్రీకాంతరెడ్డి, బిజెపి నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 60వ వర్ధంతి నేపథ్యంలో సభలో చర్చించి అంబేద్కర్ ఆశయాల సాధనకు అంకితం కావాలని ప్రజలకు సందేశం ఇవ్వాలని తీర్మానించారు. ఈ నెల 22వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సభ నిర్ణయించింది. కాగా సభ సమావేశాలను పొడిగించాలని కోరినట్లు వైకాపా ఎమ్మెల్యేలు కోరారు. కాల్ మనీ రాకెట్‌పై సభలో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.