ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి పాదాల చెంత పీఎస్‌ఎల్వీసి-34 నమూనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 21: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఇస్రో డైరెక్టర్లు మంగళవారం ఉదయం దర్శించుకుని బుధవారం నింగిలోకి ఎగరనున్న పి ఎస్ ఎల్వీ సి-34 నమూనాను స్వామివారి పాదాలచెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఇస్రో డైరెక్టర్లు జయరామన్, అరుణ్, కలంగో, అనురుప్ నైవేద్య విరామ దర్శన సమయంలో నమూనా ఉపగ్రహంతో ఆలయంలోకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఉపగ్రహం విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు. కాగా ఇప్పటికే ఉపగ్రహం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 9.25 గంటలకు 20 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకువెళ్ళనుంది. ఇస్రో డైరెక్టర్లకు ఆలయంలో అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.