ఆంధ్రప్రదేశ్‌

పెద్దయెత్తున దుర్గ గుడి ఉద్యోగుల బదిలీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగులను పెద్దయెత్తున బదిలీ చేస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ వైవి అనూరాధ ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దుర్గగుడి ఉద్యోగులపై బదిలీవేటు పడనున్నట్లు కొద్ది రోజుల నుండే పుకార్లు వెలువడుతున్నాయి. ఉద్యోగులను బదిలీ చేయాలని కోరుతూ జాబితాను దేవస్థానం ఇన్‌చార్జ్ ఇవో చంద్రశేఖర్ అజాద్ తయారు చేసి దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ అనూరాధ కార్యాలయానికి పంపారు. జాబితాలో అర్చకులను సైతం చేర్చారు. వివిధ కారణాల వలన పెండింగ్‌లో పెట్టిన దుర్గ గుడి ఉద్యోగుల బదిలీ జాబితాను కమిషనర్ బయటకు తీసి మంగళవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేసినట్టు తెలిసింది. ఈ బదిలీల్లో దేవస్థానానికి చెందిన సుమారు 8 నుండి 10 మంది అర్చకులు ఉన్నట్లు తెలిసింది.