ఆంధ్రప్రదేశ్‌

అమెరికాలో ఎంఎస్ విద్యార్థి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, జూన్ 20: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన విద్యార్థి పుట్టా నరేష్ (25) అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌ఫ్రాన్సిస్‌కోలో బోట్ షికారుకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. వ్యవసాయ కుటుంబానికి చెందిన పుట్టా పూర్ణయ్య - లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు నరేష్ ఏడాదిన్నర క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ మొదటి సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా సెలవుల్లో స్నేహితులతో కలిసి శనివారం సాయంత్రం బోట్ షికారుకు వెళ్లిన సందర్భంలో గల్లంతయ్యాడు. స్నేహితులు ఎంతసేపు గాలించినా అతని ఆచూకీ లభించలేదు. రాత్రి కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగినట్లు సమాచారం. నరేష్ గల్లంతైన విషయం సోమవారం తల్లిదండ్రులకు తెలియటంతో శోకసంద్రంలో మునిగిపోయారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ బండిపాలెం గ్రామానికి వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులను, బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థి నరేష్ కుటుంబ సభ్యులను
కలిసి వివరాలు తెలుసుకుంటున్న
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్