ఆంధ్రప్రదేశ్‌

ఫిల్మ్‌నగర్ శారదాపీఠంలో ఘనంగా మహా కుంభాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 18: విశాఖ శ్రీ శారదాపీఠ పరిపాలిత ఫిల్మ్‌నగర్ (హైదరాబాద్) దైవసన్నిధానంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఉత్సవాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు, రాజమండ్రి ఎంపి మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ తదితరులు కుంభాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మాణిక్యాల రావు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న కృష్ణా పుష్కరాలను ప్రారంభించాల్సిందిగా స్వామీజీని కోరారు. పుష్కరాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లు తదితర అంశాలపై స్వామీజీ సలహాలను కోరారు.