ఆంధ్రప్రదేశ్‌

జగన్ అజెండాను కాపులపై రుద్దుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 23: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కాపు నాయకుడు ముద్రగ పద్మనాభం రాసిన లేఖపై మంత్రి నారాయణ తీవ్రంగా స్పందించారు. సోమవారం ఆయన ఇక్కడ ఒక లేఖను విడుదల చేశారు. నెలకో లేఖ, పక్షానికో ప్రెస్‌మీట్ ద్వారా ముద్రగడ జగన్ అజెండాను కాపుల మీద రుద్దడం బాధాకరమని నారాయణ విమర్శించారు. మంజునాథ కమిషన్ పని ప్రారంభించిన తరుణంలో లేఖ రాయడం కాపుల్లో అయోమయాన్ని సృష్టించడమే అవుతుందన్నారు. జగన్‌కు వౌత్‌పీస్‌లా మారిన ముద్రగడ స్థాయిని దిగజార్చుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేద కాపుల కోసం ఎనిమిది పథకాలు ప్రకటించడం, వరాలు కురిపించడం బాధ కలిగించిందా? అంటూ ముద్రగడను మంత్రి నారాయణ ప్రశ్నించారు. ముద్రగడ కాపుల అభివృద్ధి కన్నా జగన్ మెప్పు పొందటమే మిన్నగా భావిస్తున్నారని అన్నారు.