తెలంగాణ

8న టిడిపిలో చేరతా: వరుపుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలేశ్వరం, ఏప్రిల్ 2: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా తాను ఈ నెల 8న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ప్రకటించారు. శనివారం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వరుపుల ఈ విషయాన్ని వెల్లడించారు. గత కొంత కాలంగా వరుపుల అధికార టిడిపిలోకి వెళుతున్నారనే వార్తలొస్తున్న సంగతి విదితమే. ఈ ప్రకటనతో ఆయన చేరిక ముహూర్తం స్పష్టమయ్యింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానన్నారు. అయితే గత రెండు సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలో ఉండి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఏ ప్రయోజనం చేకూర్చలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాను టిడిపిలోకి వచ్చినా ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ శ్రేణులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అందర్నీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ఈ నెల 8వ తేదీన ఉగాది నాడు విజయవాడలో సిఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నట్టు వరుపుల తెలిపారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ప్రజల సంక్షేమం కోసం ఏ పార్టీలో ఉంటే తాము కూడా అయన వెంటే ఉంటామని పలువురు నేతలు ప్రకటించారు. వైసిపికి చెందిన ఏలేశ్వరం ఎంపిపి అయిలా సత్యవతి, జడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల పెదబాబు, వైసిపి మండల కన్వీనర్ గొల్లపల్లి బుజ్జి, ఆ పార్టీ నాయకులు బుద్ధరాజు గోపీరాజు, మలకల వేణు, బదిరెడ్డి గోవిందు, ప్రత్తిపాడు సర్పంచ్ యాళ్ల విశే్వశ్వరరావు తదితరులు ఇందులో ఉన్నారు.