ఆంధ్రప్రదేశ్‌

పేదలకు ఇళ్ల స్థలాలిస్త్తుంటే బాబుకు ఎందుకో అంత బాధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 26: పేదల సొంత ఇంటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు బాధ పడుతున్నారో అర్థం కావడం లేదని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 107 అడ్మినిస్ట్రేషన్ జీవో ద్వారా రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలందరికీ ఉగాది నాటికి ఇల్లు ఇవ్వాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. రాజధాని అమరావతి కోసం భూ సమీకరణలో 53 వేల ఎకరాలు తీసుకుంటే అందులో రైతుల భూమి 33 వేల ఎకరాలు పోగా ప్రభుత్వ భూమి 20 వేలకు పైగా ఉందని, ఈ 20 వేల ఎకరాల్లో 1,251 ఎకరాలు పేదలకు ఇస్తున్నామన్నారు. దీన్ని కూడా బాబు విమర్శించడం ఆయన నైజాన్ని తెలియజేస్తుందన్నారు.