ఆంధ్రప్రదేశ్‌

‘గాంధీజీ స్వప్నం- జగన్‌కే సాధ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 26: గాంధీపథం పక్షపత్రిక 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సంచికను బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. గాంధీజీ స్వప్నం- వైఎస్ జగన్‌కే సాధ్యం పేరుతో రూపొందించిన ఈ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్‌రెడ్డి, పత్రిక సంపాదకురాలు ఎన్ పద్మజ హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలతో పత్రిక నడుపుతున్నట్లు తెలిపారు. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం, మహిళా సాధికారత, హరిజన, గిరిజనోద్ధారణ జగన్ పాలనలో సాకారమవుతున్నాయని చెప్పారు. నవరత్నాల్లో ప్రతి రత్నం గాంధీజీ ఆశయాలకు ప్రతీకగా అమలవుతున్నాయని ప్రశంసించారు. ప్రజల పక్షాన సమస్యలపై పాదయాత్ర, దీక్షలతో పోరాడి సాధించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.
*చిత్రం... ‘గాంధీజీ స్వప్నం-వైఎస్ జగన్‌కే సాధ్యం’ ప్రత్యేక సంచిక ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి తదితరులు