ఆంధ్రప్రదేశ్‌

దోచుకున్న ప్రతి రూపాయిలో లోకేష్‌కు వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఫిబ్రవరి 23: ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రతీ మంత్రి దోచుకున్న రూపాయిలో లోకేష్‌కు వాటాలు ఇచ్చేవారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. తండ్రీ కొడుకుల కనుసన్నల్లోనే ఏపీలో భారీ దోపిడీ జరిగిందని ఆదివారం ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. మంత్రిగా ఉన్న సమయంలో అచ్చెన్నాయుడు దోచుకున్న ప్రతి రూపాయిలో లోకేష్‌కు కచ్చితంగా వాటా పంపేవారన్నారు. అంతేకాకుండా తనకు పార్టీ అండగా నిలవకపోతే డైరీలన్నీ బయటికి తీస్తానని అచ్చెన్నాయుడు ఇప్పుడు బెదిరిస్తున్నారన్నారు. లోకేష్ చెబితేనే తాను లేఖ రాశానని సన్నిహితుల వద్ద ఆయన వాపోతున్నారన్నారు. ఈఎస్‌ఐ కుంభకోణం తండ్రీ కొడుకుల కనుసన్నల్లోనే జరిగిందని, అందుకే అచ్చెన్న ధీమాగా ఉన్నట్లు విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు.
బాబు జైలుకెళ్లే టైమొచ్చింది!
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లే కాలం దగ్గర పడిందని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో విమర్శించారు. ఆ జైలుకెళ్తావా చంద్రన్న.. ఈ జైలుకెళ్తావా అన్నట్లు పరిస్థితి ఉందన్నారు. ‘ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప, నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల’.. అంటూ సోషల్ మీడియా కుర్రకారు తెగ ఉగిపోతున్నారన్నారు. ‘పాపం అసలే ఎండాకాలం. రెండు ఏసీలేసుకుని పడుకునేవాడు ఎలా తట్టుకుంటాడో, ఏమో?’ అని వ్యాఖ్యానించారు. దమ్ముంటే దర్యాప్తు జరిపించుకోండి, అధికారంలో ఉన్నారుకదా.. అని నిన్నమొన్నటి వరకు సవాళ్లు విసిరిన వారంతా కుక్కిన పేనులయ్యారన్నారు. ఏ తప్పూ చేయలేదనుకుంటే సిట్ ముందుకొచ్చి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండన్నారు. అప్పుడు పునీతులని తేలితే మిమ్మల్నెవరూ పల్లెత్తు మాట అనరంటూ ట్వీట్ చేశారు.
దేశద్రోహం కేసులు పెట్టాలి
విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయటపెట్టిన పచ్చపార్టీ నేతలపై దేశద్రోహం కేసులు పెట్టాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ‘అసలు ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు’ అంటూ ట్విట్టర్‌లో ఆయన మండిపడ్డారు.