ఆంధ్రప్రదేశ్‌

సంస్కరణలకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో భూ వివాదాలకు ఇకపై బ్రేక్ పడనుంది. రెవెన్యూ సంస్కరణల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పూర్తి స్తాయిలో రికార్డుల ప్రక్షాళన (స్వచ్ఛీకరణ)కు సన్నాహాలు చేస్తోంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురితో కూడిన బృందాలను నియమించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత దోషరహిత రికార్డుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీ సర్వే నిర్వహించేందుకు కసరత్తు జరుపుతోంది. ఎప్పుడో 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా భూములను సర్వే చేసి రీ సర్వే రిజిస్టర్ (ఆర్‌ఎస్‌ఆర్) రూపొందించారు. నేటికీ ఇదే ప్రామాణికంగా లావాదేవీలు జరుపుతున్నారు. ప్రతి 30 ఏళ్లకు రీ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయనే ఆరోపణలు ఉన్నాయి. తరాలు మారి.. కుటుంబాలు విడిపోవటం తదితర కారణాలతో చాలా వరకు భూములు చేతులు మారడం వల్ల గత 120 ఏళ్లలో లెక్కలేనన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ భూములకు దరఖాస్తు పట్టాలు (డీకేటీలు) ఇవ్వడం వల్ల సబ్
డివిజన్/ సర్వేనెంబర్లు పెరిగాయి. భూముల హద్దుల విషయంలోనూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా వరకు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. భూమికీ, రెవెన్యూ రికార్డుల్లో ఉన్నదానికీ మధ్య లక్షల ఎకరాలకు పైగా తేడాలు ఏర్పడ్డాయి. భూ రికార్డులు సక్రమంగా లేనందున సివిల్ కేసుల్లో భూ వివాదాలకు సంబంధించినవే 60 శాతానికి పైగా ఉన్నట్లు న్యాయ నిపుణులు చెప్తున్నారు. రికార్డుల స్వచ్ఛీకరణ, భూముల రీసర్వే, శాశ్వత భూ హక్కుల కల్పనే ఇలాంటి సమస్యలకు ఏకైక పరిష్కారమని నిపుణులు తేల్చటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీ సర్వేకు ఆదేశించారు. ఇందులో భాగంగా మంగళవారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో బేస్ స్టేషన్‌ను ప్రారంభించి తక్కెళ్లపాడులో రీ సర్వే పైలెట్ ప్రాజెక్ట్‌ను ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభించనున్నారు. అనంతరం మండలంలోని 25 గ్రామాల్లో 66,761 ఎకరాల భూముల్లో పూర్తి స్థాయిలో రీసర్వే చేస్తారు. ఇక్కడ ఎదురయ్యే అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మార్పులు, చేర్పులతో రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వం త్వరితగతిన ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది
రైతులపై పైసా భారం మోపం: మంత్రి బోస్
ప్రస్తుతం ఎవరైనా రైతు తన భూమిని సర్వే చేయించుకోవాలంటే మీ సేవలో రుసుం చెల్లించాల్సి ఉంది. అయితే భూముల సమగ్ర రీ సర్వే ప్రాజెక్ట్‌కు రూ. 2వేల కోట్ల వ్యయం అవుతున్నా రైతులపై నయాపైసా భారం మోపకుండా ప్రభుత్వమే భరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా దేశాల్లో వినియోగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సమగ్ర రీ సర్వేకు వినియోగిస్తున్నట్లు మంత్రి వివరించారు. 2022 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తిచేసి పటిష్టమైన నూతన రెవెన్యూ రికార్డులకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.