ఆంధ్రప్రదేశ్‌

కేసుల సత్వర పరిష్కారం ధ్యేయంగా ‘దిశ’ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: దిశ చట్టం అమలు కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని, దిశ కేసుల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేక న్యాయ స్థానాలను ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని దిశ ప్రత్యేక అధికారిణి కృతిక శుక్లా తెలిపారు. దిశ చట్టం కింద నమోదైన కేసుల్లో కాలపరిమితితో కూడిన సత్వర విచారణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు లోబడి గురువారం న్యాయశాఖ జీవో 17ను విడుదల చేస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. జీవోను అనుసరించి ప్రతి జిల్లాలో ఏర్పాటయ్యే ఈ కోర్టుల్లో 21 మంది సిబ్బందిని నియమిస్తారన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఇవి ఏర్పాటు అవుతాయని, కోర్టుల నిర్వహణ కోసం ఏడాదికి రూ. 1.93 కోట్ల మొత్తం విడుదలకు సైతం ఈ జీవో మార్గం సుగమం చేసిందన్నారు. ఈ వ్యవహారాలను రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం పర్యవేక్షిస్తుందని, జిల్లా జడ్జీ ఒకరు, సూపరింటెండెంట్‌లు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్ ఒకరు, స్టేనోగ్రాఫర్ ముగ్గురు, జూనియన్ అసిస్టెంట్లు ముగ్గురు, టైపిస్టులు ఇద్దరు, ఎగ్జామినర్ ఒకరు, కాపీయిస్టు ఒకరు, రికార్డు అసిస్టెంట్ ఒకరు, అటెండర్లు ఐదుగురు ప్రతి కోర్టులోనూ పని చేస్తారన్నారు. దిశ చట్టం అమలుకు సంబంధించి ఇప్పటికే మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులుగా బాధ్యతలలో ఉన్న ఐఎఎస్ అధికారి కృతికా శుక్లాను దిశ ప్రత్యేక అధికారిగా నియమించగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల మేరకు మహిళల రక్షణే ధ్యేయంగా ఈ చట్టం రూపుదిద్దుకుని అమలుకు సిద్ధం అవుతోంది. మరోవైపు లైంగిక వేధింపులకు గురైన వారి ఆరోగ్యం, వారికి అందుతున్న వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని కూడా ఈ చట్టం క్రియాశీలకంగా పరిశీలించనుంది. ఇక్కడ మంచి ప్రమాణాలు ఉన్న వైద్య, పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వం ధ్యేయమని కృతికా శుక్లా తెలిపారు. ఈ కేంద్రాలలో ఒక ఎస్‌ఐ స్థాయి అధికారి, గైనకాలజిస్టు అందుబాటులో ఉంటారు. మరో వైపు ఈ కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కేసుల్లో సంక్షేమం, ఉపశమనం, పునరావాసం, పోలీసులతో సహకారం వంటి మొత్తం బాధ్యతలను దిశ ప్రత్యేక అధికారి సమన్వయపరుస్తారు.