ఆంధ్రప్రదేశ్
రైతులకు భరోసాగా కవాతు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 23 January 2020
గుంటూరు, జనవరి 22: ఆరుగాలం పంటలు పండే సుక్షేత్రాలైన భూములను రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేసిన రైతులకు తామున్నామని భరోసాగా బీజేపీ, జనసేన పార్టీలు భారీ కవాతు నిర్వహించనున్నాయి. ఫిబ్రవరి 2 వ తేది మధ్యాహ్నం 2 గంటలకు ప్రకాశం బ్యారేజీ, సీతానగరం లాకుల ప్రాంతం నుండి విజయవాడ బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు జరిగే కవాతులో రైతులు కూడా పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ దేవధర్, పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంయుక్తంగా పిలుపునిచ్చారు.