ఆంధ్రప్రదేశ్‌

హోం మంత్రి ఇంటి వద్ద బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: గుంటూరు నగరంలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ముట్టడికి జేఏసీలు, పార్టీలు పిలుపు ఇవ్వటంతో నగరంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర తెలుగు యువత నాయకుడు మనె్నం శివనాగమల్లేశ్వరరావు, నసీర్ అహ్మద్, డేగల ప్రభాకర్ తదితరులు నగరంలోని హోం మంత్రి మేకతోటి సుచరిత ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.