ఆంధ్రప్రదేశ్‌

రోజాకు రాజకీయ భిక్ష పెట్టింది బాబే; పంచుమర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: ఒకే సామాజికవర్గం అంటూ ఎమ్మెల్యే రోజా పదే పదే మాట్లాడటం తగదని, ఆమెది ఏ సామాజికవర్గమని చంద్రబాబు నాయుడు రాజకీయ బిక్ష పెట్టారో ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ హితవు పలికారు. వేరే పార్టీలో చేరి ప్యాకేజీ కోసం పనిచేస్తున్న వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మర్యాద దక్కదన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో పంచుమర్తి మాట్లాడారు. ఏడు నెలల వైసీపీ పాలనే ఆ పార్టీ పతనానికి నాంది పలుకుతుందన్నారు. బోగస్ కమిటీలను ప్రజల ముందు పెట్టి వారిని మోసగిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు.