ఆంధ్రప్రదేశ్‌

కేన్సర్ రోగులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: కేన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా పూర్తి స్థాయిలో అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమ కంటి కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి.. అధికారులకు పలు సూచనలు చేశారు. హేమ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని వైద్యం కోసం అవసరమైన తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చికిత్సలో ఎన్ని సైకిల్స్ అవసరమైనా పూర్తి ట్రీట్‌మెంట్ అందిస్తామని ప్రకటించారు. గతంలో మాదిరి కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స నిర్వహించాలన్నా రు. జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఈలోగా అత్యవసర కేసులు ఉంటే రోగులకు వెంటనే చికిత్సలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. నిరుపేదలను ఆదుకునేందుకే ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలు తీసుకు వస్తున్నామని స్పష్టం చేశారు.