ఆంధ్రప్రదేశ్‌

ఇంగ్లీషు మాధ్యమ అమలు ప్రత్యేకాధికారిగా వెట్రిసెల్వి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 2: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి ఆరవ తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం అమలు తీరును పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిగా కే వెట్రిసెల్విని సోమవారం ప్రభుత్వం నియమించింది. షెడ్యూల్డ్ ఏరియాలో సర్వే, అసైన్‌మెంట్, కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆమె ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. అమెను ఇంగ్లీషు మీడియం అమలు ప్రాజెక్టుకు ప్రత్యేకాధికారిగా, పాఠశాల విద్యకు ఎక్స్-ఆఫీషియో జాయింట్ సెక్రటరీగా కూడా నియమించింది.
రంగా వర్సిటీ పాలక మండలి నియామకం
ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీ పాలక మండలిని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కేటగిరీల కింద 7 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..